Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్లో డీఎస్ చేరిక మళ్లీ వాయిదా పడింది. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన ఆయన కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో డీఎస్ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత డీఎస్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి, సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ సమయంలో ఆయన చేరిక వాయిదా పడినట్లు ప్రకటన వెలువడింది.