Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పరిపూర్ణ విప్లవకారుడిగా జీవించిన కామ్రేడ్ బండ్రు నర్సింలు అనారోగ్యంతో చికిత్సపొందుతూ మరణించిన విషయం తెలిసిందే. నూరేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, దాంతో పాటు సమాంతరంగా సాగిన ఆయన విప్లవ గాథ మూడుతరాలను ప్రభావితం చేస్తూ కొనసాగింది. దీనిని మననం చేసుకుంటూ భావితరాలకు అందించడానికి ''తెలంగాణ సాయుధ విప్లవ పోరాట యోధుడు కామ్రేడ్ బండ్రు నర్సింలు జ్ఞాపకం'' అంటూ పుస్తకం వెలువరిస్తున్నామని ప్రజావిమోచన సంపాదక వర్గం నుంచి విమలక్క ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 30న ఆలేరులో స్మారక సభ నిర్వహిస్తున్నందున ఆ నాటికి వ్యాసాలు, అనుభవాలు, పాటలు, కవితలు 25నాటికి bandrunarasimhulu1915@gmail.com, prajavimochana2015@gmail.com కు పంపాలని కోరారు.