Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ఫిబ్రవరి ఐదు నుంచి 27 వరకు జరుగనున్న ప్రైమ్ వాలీ బాల్ లీగ్ పోస్టర్ను క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ ఆదివారం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి లోని ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ ''ప్రైమ్ వాలీ బాల్ లీగ్ '' లో దేశ వ్యాప్తంగా హైదరాబాద్ జట్టు తో పాటు 7 నగరాల నుంచి వాలీబాల్ జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అభిషేక్ రెడ్డి పాల్గొన్నారు.