Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని మండలాల్లో సమీకత కార్యాలయం
- భవనాల కోసం భూ సేకరణ చేయండి
- గజ్వేల్ అభివద్ధి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్
నవ తెలంగాణ-గజ్వేల్
గజ్వేల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలనీ, దీని కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్ రామ్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మెన్ ప్రతాప్ రెడ్డిలతో సుదీర్ఘంగా గజ్వేల్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు ఎంత వరకు వచ్చాయి? ఇంకా ఏం పనులు కావాలో ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. గజ్వేల్ బస్టాండ్, రింగ్ రోడ్డు, రేడియం రోడ్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలోని సమీకృత మార్కెట్, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఒకే చోట ఉండే విధంగా నిర్మించేందుకు కావాల్సిన భూ సేకరణ చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఇందుకు కావాల్సిన నిధులను మంజూరు చేస్తామని సూచించారు. రింగ్ రోడ్డు పనులు ఎంత వరకు వచ్చాయి? గజ్వేల్ నియోజకవర్గానికి ఇంకా ఏం పనులు కావాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ద్వారా అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. చేపట్టబోయే పనులకు దగ్గరుండీ ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని నిధులు మంజూరు చేసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి తీసుకురావాలని ఆదేశించారు.