Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గద్దెల గ్రిల్స్ మూసివేత
- జాతరలో ఫిట్స్తో ఒకరి మృతి
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారం మహాజాతరకు ఆదివారం జనం పోటెత్తారు. ములుగుజిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహాజాతర ఫిబ్రవరి నెలలో జరగనున్న విషయం తెలిసిందే. కానీ కరోనా కేసులు పెరుగుతుండటంతో జాతరకు ముందస్తుగా జనం వస్తుండటంతో మేడారం కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో ఆదివారం సెల వుదినం కావడంతో తెల్లవారుజాము నుంచే భారీగా జనం రావడం కనిపించింది. సుమారు 3లక్షల మందికిపైగా మేడారం వనదేవతలను సందర్శించుకున్నట్టు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మేడారం చేరుకున్న భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి కల్యాణ కట్టల వద్ద తలనీలాలు సమర్పించు కుంటున్నారు. అనంతరం వనదేవతల గద్దెల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకు న్నారు. తదనంతరం కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనాలు సాయంత్రం వరకు మేడారం పరిసరాల్లో గడిపారు. నెల రోజులుగా జనం మేడారానికి వస్తు న్నా తాజాగా జనం పోటెత్తడం కనిపించింది. జాతర సమీపిస్తున్న క్రమంలో సుమారు 50వేలవరకు రావచ్చని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతోన్న క్రమంలో మేడారానికి జనం భారీగా రావడం గమనార్హం. కాగా పలువురు కోవిడ్ నిబంధనలు పాటించని దుస్థితి నెలకొంది. జనం గుంపులుగా గద్దెల వద్దకు వస్తుండటంతో అధికారులు గ్రిల్స్ మూసి దర్శనానికి అనుమతించారు. ఇదిలా ఉండగా వనదేవతల దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి ఫిట్స్తో మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు.