Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు చొరవ చూపాలి
- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ను మంత్రి కే. తారకరామారావు కోరారు. ఈ మేరకు ఆదివారం పలు అంశాలపై లేఖలు రాశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉన్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని గతంలో అనేకసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని గుర్తు చేశారు. ఈ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పరికరాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా ఇండిస్టి యల్ కారిడార్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డిఫెన్స్ ఇండిస్టియల్ ప్రొడక్షన్ కారిడార్లో హైదరాబాద్ను చేర్చాలనీ, హైదరాబాద్ ఫార్మా సిటీకి ప్రత్యేక ఆర్థిక సహాయం, మాస్టర్ ప్లాన్ కోసం రూ.50 కోట్లు, రోడ్ల లింకేజీ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రైల్వే కనెక్టివిటీ వంటి ఎక్స్టర్నల్ మౌలిక వసతుల కోసం రూ.1,399 కోట్లు, జీరో లిక్విడ్ డిస్ఛార్జ్ ఆధారంగా పనిచేసే ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి అంతర్గత మౌలిక వసతుల కోసం మరో రూ. 3,554 కోట్లు, మొత్తంగా హైదరాబాద్ ఫార్మా సిటీకి రూ.5003 కోట్లని ఈ బడ్జెట్లో కేటాయించాలని మంత్రి కేటీఆర్, నిర్మల సీతారామన్ ని కోరారు.