Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్ఫూర్తివంతంగా సీపీఐ (ఎం) రాష్ట్ర మూడో మహాసభలు
- అరుణపతాకాన్ని ఆవిష్కరించిన సారంపల్లి
- అడుగడుగునా అమరవీరుల జ్ఞాపకాలు
- ఉత్సాహభరితంగా ప్రతినిధుల సభ ప్రారంభం
కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్ (తుర్కయంజాల్) నుంచి బి.వి.యన్.పద్మరాజు
అడుగడుగునా అమరవీరుల త్యాగాల స్మరణం... సమస్యలపై రణన్నినాదం మార్క్సిస్టు మహౌపాధ్యా యుల సందేశాల తోరణం... పేదల మదినిండిన ఎర్రజెండా మహౌన్నత సత్కార సాక్షాత్కారం... భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు (సీపీఐ-ఎం) రాష్ట్ర మూడో మహాసభలో రెండో రోజైన ఆదివారం ప్రతినిధుల సభ అద్భుత ప్రారంభ దృశ్యం. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ (కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్, కుంజ బొజ్జి, మస్కు నర్సింహ ప్రాంగణం)లో ప్రజా నాట్య మండలి కళాకారుల డప్పుల మోత, 'అమరవీరులకు లాల్ సలాం, సాధిస్తాం.. అమర వీరుల ఆశయాలను..' అనే కార్యకర్తల నినాదాల నడుమ అత్యంత స్ఫూర్తిదాయకంగా సభ ప్రారంభ మైంది. సీపీఐ (ఎం) సీనియర్ నాయకులు సారం పల్లి మల్లారెడ్డి... అరుణ పతాకాన్ని ఆవిష్కరించి ప్రతినిధుల సభను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు కె.హేమలత, ఎస్.పుణ్యవతి, అరుణ్కుమార్, ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితోపాటు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రతినిధులు, పరిశీలకులు నివాళులర్పించారు. అనివార్య కారణాల వల్ల భౌతికంగా హాజరు కాలేకపోయిన పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి... ఆన్లైన్ ద్వారా ఢిల్లీ నుంచి ప్రారంభో పన్యాసం చేశారు. ప్రతినిధుల సభకు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బీ.వెంకట్, జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎమ్డీ జబ్బార్, ఎస్.రమ, తొడసం భీంరావ్ అధ్యక్షవర్గంగా వ్యవ హరించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు ప్రసంగించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డి సౌహార్ద్ర సందేశమిచ్చారు.
మూడు రోజులు జరిగే ఈ సభకు వేదికైన కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్ను ఆహ్వాన సంఘం, నిర్వహణ కమిటీలు అరుణ పతాకాల రెపరెపలతో అలంకరణ చేశాయి. దక్షిణ భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు, మార్క్సిస్టు సైద్ధాంతిక మేధావి మాకినేని బసవపున్నయ్యతోపాటు రంగారెడ్డి జిల్లా ప్రజా పోరాటాలతో మమేకమై అసువులు బాసిన పాషా, నరహరి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి ఐలమ్మ, ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్, మార్క్సిస్టు మహౌపాధ్యాయులు కారల్ మార్క్స్, ఏంగిల్స్ తదితరుల చిత్రపటాలతో సభా ప్రాంగణాన్ని (ఎస్ఎస్ఆర్ గార్డెన్స్) అందంగా ముస్తాబు చేశారు. ఆక్కడే వారి అమూల్య సందేశాలతో కూడిన హౌర్డింగులను ఉంచారు. బీఎన్ రెడ్డి నగర్ నుంచి తుర్కయాంజాల్ వరకు రోడ్డుకు రెండు వైపులా ఎర్రని తోరణాలు, ప్రత్యేక హౌర్డింగులతో అలకరించారు.
పక్కాగా కోవిడ్ నియమ నిబంధనలు...
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు, ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని... వాటిని పాటించేందుకు వీలుగా ఆహ్వాన సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతినిధులు, పరిశీలకులు, వెటరన్లకు అందజేసిన బ్యాగుల్లో మూడేసి చొప్పున ఎన్ 95, సర్జికల్ మాస్కులు, శానిటైజర్లను ఉంచారు. అల్పాహారం, భోజన హాళ్లలో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. 'కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సీపీఐ (ఎం) మహాసభను నిర్వహిస్తున్నాం...' అనే బోర్డులను అడుగడుగునా ఏర్పాటు చేశారు. సభ ప్రారంభంలోనే కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలి, అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటూ సూచించారు.