Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • 34 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు
  • పెండ్లికి ముందు అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం
  • పల్లె, పట్టణ ప్రగతిలపై మంత్రి సమీక్ష
  • భార్యపై అనుమానంతో మెడ నరికిన భర్త
  • పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ విద్యార్థి మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బీజేపీకి వ్యతిరేకంగా విశాల ఐక్య సంఘటన | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

బీజేపీకి వ్యతిరేకంగా విశాల ఐక్య సంఘటన

Mon 24 Jan 02:06:56.363069 2022

- సీపీఐ (ఎం) ప్రతినిధుల సభలో సీతారాం ఏచూరి
- ప్రజా ఉద్యమాలను బలపర్చటమే మార్గం
- వామపక్షాలు బలపడాలి
- ప్రజాస్వామిక, లౌకిక శక్తులను కలుపుకుని పోవాలి : సీపీఐ(ఎం) ప్రతినిధుల సభలో సీతారాం ఏచూరి
- ఫాసిస్టు హిందూ రాష్ట్ర స్థాపనే బీజేపీ లక్ష్యం
- అమెరికా ముందు మోడీ తోలుబొమ్మ
- నాటి హెచ్చరికలే.. నేడు నిజమయ్యాయి
కామ్రేడ్‌ సున్నం రాజయ్య నగర్‌
(తుర్కయంజాల్‌) నుంచి బి.వి.యన్‌.పద్మరాజు
ఫాసిస్టు హిందూ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విశాల ఐక్య సంఘటన ఏర్పడాల్సిన అవసరముందని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సూచించారు. ప్రజా ఉద్యమాలను బలపర్చటమొక్కటే దీనికి మార్గమని చెప్పారు. ఇందులో భాగంగా మొదట వామపక్షాలు బలపడాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామిక, లౌకిక శక్తులను కలుపుకోవాలని సూచించారు. సీపీఐ (ఎం) రాష్ట్ర మూడో మహాసభలో రెండో రోజైన ఆదివారం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ (కామ్రేడ్‌ సున్నం రాజయ్య నగర్‌)లో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సభలో ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఏచూరి ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో ఆరెస్సెస్‌ ఫాసిస్టు అజెండాను అమలు చేయటమే బీజేపీ లక్ష్యమంటూ తమ పార్టీ ఏనాడో హెచ్చరించిందని గుర్తు చేశారు. అది ఈనాడు నిజమవుతున్నదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహౌత్సవాల్లో 'దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చటమే మా లక్ష్యం...' అంటూ బీజేపీ ప్రకటించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఆ పార్టీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత...దేశ సంపదను కార్పొరేట్లకు శరవేగంగా ధారాదత్తం చేస్తున్నదని తెలిపారు. కార్మికుల హక్కులు, అధికారాలను హరించి వేస్తున్నదన్నారు. మరోవైపు రాజకీయ అవినీతి అనేది 'లీగలైజ్‌డ్‌ పొలిటికల్‌ కరప్షన్‌...'గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మత రాజకీయాల్లో భాగంగా ఆర్టికల్‌ -370, 35 (ఎ) రద్దు, సీఏఏ, ఎన్సార్సీ, ఎన్పీఆర్‌లను ముందుకు తెచ్చిందన్నారు. పౌర, ప్రజాస్వామిక హక్కులపై పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నదని వివరించారు. ఇదే సమయంలో బీజేపీ చర్యలు, విధానాలకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు బలపడుతున్నాయని ఏచూరి గుర్తు చేశారు. రైతాంగ ఉద్యమాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనేక విషయాల్లో అమెరికాకు జూనియర్‌ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్‌... దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని తెలిపారు. ఆ దేశం ముందు ప్రధాని మోడీ...తోలు బొమ్మలా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రానంతరం... దేశాన్ని లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర దేశంగా ప్రకటించుకున్నామని గుర్తుచేశారు. భారతదేశ ఐక్యత, సమగ్రత, సమైక్యతను దృష్టిలో ఉంచుకుని ఆనాటి నాయకులు ఇలాంటి అంశాలను రాజ్యాంగంలో చేర్చారని తెలిపారు. ఇది నచ్చకే ఆరెస్సెస్‌... గాంధీని హత్య చేయించిందని అన్నారు. తమ లక్ష్యాల్లో భాగంగా మహమ్మద్‌ అలీ జిన్నా ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ (పాకిస్తాన్‌)ను స్థాపించారని తెలిపారు. కానీ ఇక్కడ (ఇండియాలో) హిందూ రాష్ట్ర స్థాపన అనే ఆరెస్సెస్‌ అజెండా ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. ఆ ప్రమాదం ఇంకా తొలగిపోలేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తన అజెండా అమలుకు రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలైన లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర అనేవి అడ్డంకిగా ఉన్నాయని భావించిన బీజేపీ... ఇప్పుడు రాజ్యాంగాన్ని, దాని మౌలిక సూత్రాలను ధ్వంసం చేస్తున్నదని హెచ్చరించారు. రాజ్యాంగ సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఎన్నికల సంఘం (ఈసీ)తోపాటు న్యాయ వ్యవస్థను సైతం తన చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా ప్రతిపక్షాలు, ఆయా పార్టీల నేతలపై కేసులు పెట్టి లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నదని వివరించారు. మెజారిటీ లేకపోయినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం ద్వారా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని చెలాయిస్తున్నదని విమర్శించారు. త్వరలో ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బొమ్మలు ముద్రించి ఉన్న సంచుల ద్వారా రేషన్‌ సరుకులను పంపిణీ చేశారని తెలిపారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమనీ, అయినా నేటి వరకూ ఎన్నికల సంఘం స్పందించలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి అంశాలన్నింటిపై మహాసభలో సమగ్రంగా చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణకు రూపకల్పన చేయాలని ఏచూరి పిలుపునిచ్చారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆగస్టులోనే పోలీసు ప్రిలిమినరీ పరీక్షలు
కేంద్ర పథకాలతో రాష్ట్రానికి నిధులు
దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ
చివరికి ప్రభుత్వాస్పత్రికి...
భళా... సర్కారు బడి
యోగా డేను పండుగలా జరుపుకోవాలి
దమ్ముంటే మా ప్రభుత్వాన్ని రద్దు చేసి పోటీకి రండి
ఉపాధి హామీ పనుల్లో అపశృతి
ఆషా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
'పది' పరీక్షలకు 99.06 శాతం హాజరు
గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా 'శ్రీకాంత్‌ గౌడ్‌'
ఇంటర్‌లో ఆరు కొత్త కోర్సులు!
దేశానికే అభివృద్ధి నమూనా అందిస్తున్న కేసీఆర్‌
తెలంగాణ జాతి గర్వించదగ్గ....
సమాలోచన సభ
బీజేపీ బండ్రు శోభారాణి రాజీనామా
30న సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం
కుటుంబ పాలనతో రాష్ట్ర ప్రజలకు విసుగు :కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
గ్రూప్‌-1 దరఖాస్తుకు ఇంకా 4 రోజులే
ఏఐసీటీఈ ఆదేశాలను అమలు చేయొద్దు
విమానయాన రంగంలో పుష్కలంగా ఉద్యోగవకాశాలు
విద్యుత్‌ఘాతంతో గడ్డి, ట్రాక్టర్‌ దగ్ధం
సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన సురవరం : సీఎం కేసీఆర్‌
జులై 4 నుంచి అంబేద్కర్‌ వర్సిటీ పీజీ పరీక్షలు
వాహన సామర్థ్య పరీక్షలు షురూ
ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి
బీజేపీదే ఫ్యామిలీ ప్యాక్‌
దళితుల భూములు లాక్కోవద్దు
ధరాఘాతంపై ఆగ్రహం
నెల రోజులుగా కేంద్రాల్లోనే ధాన్యం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.