Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన టి.జ్యోతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నల్లగొండలో జరిగిన రెండో మహాసభ నుంచి ప్రస్తుత మహాసభ మధ్య కాలంలో చనిపోయినవారికి, ప్రకృతి విపత్తులో మరణించినవారికి, పోరాటాల్లో అసువులుబాసిన అమరవీరులకు సీపీఐ(ఎం) మూడో మహాసభ నివాళులు అర్పించింది. సంతాప తీర్మానాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.జ్యోతి ప్రవేశపెట్టారు. పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు మహ్మద్ అమీన్, నిరుపమ్సేన్, కె.వరదరాజన్, కేంద్ర కమిటీ సభ్యులు గౌతందాస్, బిజోన్ధర్, శ్యామల్ చక్రవర్తి, మోహర్సింగ్, మహేంద్రసింగ్, గణేశ్ శంకర్ విద్యార్థి, జక్కా వెంకయ్యలకు మహాసభ నివాళులు అర్పించింది. ఇటీవల చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, మస్కు నర్సింహ్మ, కుంజాబొజ్జి సీపీఐ(ఎం)కి చేసిన సేవలను స్మరించుకున్నారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నాయకులైన వియత్నాం కమ్యూనిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి లే ఖా ఫ్యూ, వియత్నాం మాజీ అధ్యక్షులు ట్రాన్డారు క్వాంగ్, చైనా కమ్యూనిస్టు అగ్రనేత, మాజీ ప్రధాని లీపెంగ్, లాటిన్ అమెరికా మార్క్సిస్టు మేధావి మార్తా హర్నేకర్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్, దక్షిణాఫిక్రా విన్నీ మండేలా, అమెరికా దేశ కార్మిక నేత రిచర్డ్ ట్రుంకాకు మహాసభ జోహార్లు అర్పించింది. మహిళా ఉద్యమ జాతీయ నేతలు మైథిలీ శివరామన్, గౌరియమ్మ(కేరళ), మంగళేశ్వరి దేబ్భర్మా(త్రిపుర), రంజనా నిరులా, ప్రమీలా పాంథే, అఖిల భారత సైన్స్ ఉద్యమ నేత అమిత్సేన్ గుప్తాకు, పాత్రికేయులకు, పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ దాడుల్లో, త్రిపురలో బీజేపీ దాడుల్లో, కేరళలో ఆర్ఎస్ఎస్వ్యక్తుల చేతుల్లో మరణించిన పార్టీ శ్రేణులకు, అన్ని జిల్లాల సీపీఐ(ఎం) నాయకులకు, కార్యకర్తలకు మహాసభ సంతాపాన్ని ప్రకటించింది.