Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక, కర్షకుల దిక్సూచీ నవతెలంగాణ : సీపీఐ(ఎం) పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దోపిడీకి గురవుతున్న కార్మిక, కర్షక వర్గాల పక్షాన దిక్సూచిగా నవతెలంగాణ పత్రిక నిలుస్తుందని సీపీఐ(ఎం) పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. సీపీఐ(ఎం) 3వ రాష్ట్ర మహాసభలు రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజాల్లో ఆదివారం ప్రారంభమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కాచం కృష్ణమూర్తి, పోచమోని జంగయ్య, బడ్డు సాలయ్య, పాషా, నరహరి కీలక భూమిక పోషించారు. వారి వారసత్వంతో ప్రస్తుతం జిల్లాలో పోరాటాలు కొసాగుతున్నాయి. అప్పటి నుంచి నేటి వరకు జరుగుతున్న పోరాటాలను గుర్తు చేస్తూ వార్తా కథనాలను నవతెలంగాణ అందించింది. ఈ ప్రత్యేక సంచికను మహాసభలో ఆదివారం ఆవిష్కరించారు. ఆవిష్కరించిన వారిలో కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బి.వెంకట్, నంద్యాల నర్సింహారెడ్డి, డీజీ నర్సింహరావు, సాయిబాబు, రమ, జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్, నవతెలంగాణ ఎడిటర్ ఆర్. సుధాభాస్కర్, సీజీఎం ప్రభాకర్, జనరల్ మేనేజర్ అంబటి వెంకటేష్, రంగారెడ్డి జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.