Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 3,944 మందికి కరోనా సోకింది. ముగ్గురు మరణించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 97,549 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 5,537 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 39,520 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 1,372 మందికి కరోనా సోకింది. మేడ్చల్ - మల్కాజిగిరిలో 288, రంగారెడ్డిలో 259, హన్మకొండలో 117, ఖమ్మంలో 135 మంది,సంగారెడ్డి లో 120, సిద్ధిపేటలో 104, నిజామాబాద్ లో 105 మంది వ్యాధి బారిన పడ్డారు. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 4.04 శాతంగా నమోదయింది.