Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 1,217 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 48,434 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 3,944 మంది డిశ్చార్జి అయ్యారు.1,325 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,498 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 2,544 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 383 మందికి కరోనా సోకింది. రంగారెడ్డిలో 103 మంది వ్యాధి బారిన పడ్డారు. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 2.51 శాతంగా నమోదయింది.