Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ రెండు, మూడు, నాలుగో సెమిస్టర్తోపాటు ఎంబీఏ రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ విద్యార్థులకు వచ్చేనెల 21నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ లక్ష్మారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చివరితేదీ వచ్చేనెల రెండో తేదీ వరకు ఉందని తెలిపారు. ఈ పరీక్షలను మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు www.braou.ac.in పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఫీజును టీఎస్/ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా లేదా డెబిట్/ క్రెడిట్ కార్డుతో చెల్లించాలని కోరారు. ఇతర వివరాల కోసం షషష.bతీaశీబ.aష.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.