Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రపతి రాంనాధ్కోవింద్ ఈనెల 13న ముచ్చింతల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. గురువారం బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతాధికారులతో రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భారీకేడింగ్ చేయాలని ఆదేశించారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలనీ, ప్రోటోకాల్ను పాటించాలని సూచించారు. రాష్ట్రపతి పర్యటన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను పెంచుతుందనీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు మరింత గుర్తింపును తెస్తుందని వివరించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, జీఏడీ కార్యదర్శి వికాస్రాజ్, కుటుంబ, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, హైదరాబాద్ పొలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, గ్రేటర్ కమిషనర్ లోకేశ్కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోరుకుమార్, మెదక్ కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.