Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో దక్షిణ, నైరుతి దిశల మీదుగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం వల్ల వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పలు జిల్లాలకు వచ్చే మూడు రోజులకుగానూ ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్, ప్లానింగ్ సొసైటీ జారీ చేసింది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్నసిరిసిల్ల, కుమ్రంభీమ్ అసిఫాబాద్, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, హన్మకొండ జిల్లాలు ఆరెంజ్ హెచ్చరిక జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్లోనూ చలి ఉండే అవకాశం ఉంది.