Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో భూముల వేలాన్ని తక్షణం నిలుపుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్కే పరిమితమైన భూముల వేలంపాటలు ఇప్పుడు జిల్లాలకూ విస్తరిస్తున్నాయని శనివారంనాడొక పత్రికా ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. భూముల ధరలు అడ్డగోలుగా పెరిగి నిరుపేద, పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో లేకుండా పోయాయన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. భవిష్యత్ అవసరాలకు భూములు లేకుంటే ప్రభుత్వాలకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం భూముల మార్కెట్ ధరలు రెండు సార్లు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కారించలేదని గుర్తుచేశారు.