Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దండేపల్లి
అప్పుల బాధతో రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. ఏఎస్ఐ పాల్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అప్పల నారాయణ(46) ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లి రెండేండ్ల కిందట గ్రామానికి తిరిగొచ్చాడు. స్వదేశానికి వచ్చిన ఆయన వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే పంట పెట్టుబడి నిమిత్తం దాదాపు రూ.3లక్షలు అప్పులు చేశారు. సరైన దిగుబడి రాక చేసిన అప్పులు తీర్చే స్థోమత లేక మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య భూలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ తెలిపారు.