Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ పోరాట యోధులు, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల ముగింపు సభను మంగళవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్టు వృత్తి సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపాముల వెంకట్రాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజాం నిరంకుశ పరిపాలనకు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా , దున్నే వానికే భూమి, గీసే వానికే చెట్టు, సాంఘిక సమానత్వం అనే నినాదాలపై సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ధర్మభిక్షం చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. స్వాతంత్య్రానంతరం శాసనసభలో, పార్లమెంట్లో పేదల గొంతును వినిపించారని పేర్కొన్నారు. గీత పనివారల సంఘాన్ని నిర్మించి ,జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా వారి హక్కుల సాధనకు ఆయన చేసిన కృషి మరువలేనిదని తెలిపారు.