Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేగదూడకు వినతిపత్రమిచ్చిన గ్రామస్తులు
నవతెలంగాణ-విద్యానగర్
అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని కుండిషేకుగూడ వాసులు వినూత్న నిరసన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట వారు చేపడుతున్న నిరవధిక దీక్షలు ఆరో రోజుకు చేరాయి. అధికారులు స్పందించకపోవడంతో ఆదివారం లేగదూడకు వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పూసం సచిన్ మాట్లాడుతూ.. కుండిషేకుగూడ ఆదివాసులు ఆరు రోజులుగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్నా అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. గూడెం వాసులు ఏండ్లుగా కనీస సదుపాయాలైన తాగునీరు, రోడ్డు సౌకర్యానికి కూడా నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు అత్రం నగేష్, గ్రామస్తులు గంగారాం, దౌలత్రావు, చందు, సుంగు, జైతు, లింగుబాయి, నాగోరావు, ఆత్రం రేణుక, జంగుబాయి పాల్గొన్నారు.