Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 21 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్న స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర సర్కారు మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 31 వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నది. జీవో నెంబర్ 14ను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. 58,59 కింద జారీ చేసిన ఉత్తర్వులకు లోబడి దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న స్థలాలను నిర్ణీత రుసుముతో క్రమబద్ధీకరిస్తారు.