Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18న సిరిసిల్ల..21న హన్మకొండ..
- 23న వనపర్తి..25న హైదరాబాద్లో.. :టీఎస్ఈఆర్సీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపు అంశంపై ఈనెల 18 నుంచి బహిరంగ విచారణలు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ప్రకటించింది. ఈ మేరకు సోమవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో 18వ తేదీ సిరిసిల్లలోని సిద్దిపేట రోడ్ విద్యానగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ బహిరంగ విచారణ జరుగుతుంది. 21వ తేదీ హన్మకొండ జిల్లా కోర్టు భవన సముదాయాల ఎదురుగా ఉన్న జిల్లా ప్రజా పరిషత్ హాల్లో బహిరంగ విచారణ జరుగుతుంది. టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో 23వ తేదీ వనపర్తి జిల్లా పెద్దమండి రోడ్ కళ్యాణసాయి గార్డెన్స్లో, 25న హైదరాబాద్లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ప్రాంగణంలో బహిరంగ విచారణలు జరుగుతాయని టీఎస్ఈఆర్సీ కార్యదర్శి తెలిపారు.