Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ నెల 17న తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఉదయం 10 గంటలకు కేక్ కటింగ్, ముఖ్యమంత్రి జీవిత చరిత్ర, ఉద్యమ నేపథ్యంతో త్రీడీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్తో రూపొందించిన హిందీ డాక్యుమెంటరీని ప్రదర్శన, ముఖ్యమంత్రి ఉద్యమ చరిత్ర, సంక్షేమ పాలనను వివరించేలా డిజిటల్ డిస్ ప్లే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.. ఇవే కాకుండా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయుష్షు హౌమం, చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమాల ను ఉంటుందని వివరించారు. అదేవిధంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో మత్యుంజయ హౌమం, అన్నదానం, నాంపల్లిలోని దర్గాలో చాదర్ సమర్పణ, అమీర్పేట లోని గురుద్వార్లో హార్దస్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ భవన్లో నిర్వహించే కార్యక్రమంలో పలువురు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు.