Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో దళిత విద్యార్థిని పై లైంగికదాడికి పాల్పడి, హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ ఎస్వీ రమ డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు కూడా రాష్ట్రంలో భద్రత లేకపోవడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరివల్లనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. హుగ్గెల్లి ఘటనలో దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు.