Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరొకరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-మంగపేట
ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి చెక్పోస్టు, దుగినేపల్లి గ్రామాల నడుమ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అటవీ శాఖ సూపరింటెండెంట్ మృతిచెందారు. మృతుడు మహబూబాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ సిరికొండ కృష్ణమాచారి(52). స్థానికుల వివరాల ప్రకారం.. కృష్ణమాచారి మేడారం మహాజాతర సందర్భంగా భద్రాచలం నుంచి హన్మకొండకు వస్తుండగా బ్రాహ్మణపల్లి చెక్పోస్టు సమీపంలోని మూలమలుపులో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణమాచారి అక్కడికక్కడే మృతిచెందారు. అతడి భార్య కళావతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడతో ఎస్ఐ తాహెర్ బాబా, అటవీ శాఖ రేంజ్ అధికారి షకీల్ పాషా ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కృష్ణమాచారి మృతదేహాన్ని ఏటూరునాగారంలోని సామాజిక ఆస్పత్రికి తరలించారు. కళావతిని108 వాహనంలో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.