Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు ఫోన్ చేసి ఆహ్వానించిన ఉద్ధవ్
- దేశం కోసం చేస్తున్న పోరాటంపై ప్రశంసించిన థాకరే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్థాకరేతో ఈ నెల 20న ముంబైలో భేటీ కానున్నారు. ఈ మేరకు కేసీఆర్కు థాకరే ఫోన్చేసి ఆహ్వానించారు. ''కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం. మిమ్ముల్ని ముంబైకి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందాం'' అంటూ థాకరే సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలంగాణ సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు కేసీఆర్ ఈ నెల 20న ముంబైకి వెళ్లనున్నారని తెలిపింది. తీసుకోండి. భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందాం'' అంటూ థాకరే సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలంగాణ సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు కేసీఆర్ ఈ నెల 20న ముంబైకి వెళ్లనున్నారని తెలిపింది.