Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుజూరాబాద్ రూరల్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు సైదాపూర్ రోడ్డులోని కాకతీయ కెనాల్లో పడి గల్లంతయ్యారు. పట్టణంలోని హైస్కూల్ ప్రాంతానికి చెందిన తాడూరి పవన్(19)డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా డు.అలాగే,సైదాపూర్ రోడ్డులో నివాసముండే ఓ బాలిక 9వ తరగతి చదువుతోంది.బుధవారం రాత్రి 11:30 ప్రాంతంలో పవన్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అతనితోపాటు బాలిక కూడా వెళ్లింది. ఇద్దరూ బోరునపెళ్లి రోడ్డు వద్ద ఉన్న కాకతీయ కెనాల్లో పడి గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతయ్యారా? లేక వారిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.