Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సివిల్ సప్లయీస్ హామాలీ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు ఎల్మకంటి శ్రీనివాస్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణానికి ఏఐటీయూసీ సంతాపం ప్రకటించింది. సివిల్ సప్లయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అనేక పోరాటాలు నిర్వహించారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాలరాజు, ప్రధాన కార్యదర్శి విఎస్బోస్ నివాళులర్పించారు. కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ యూసుఫ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఉజ్జిని రత్నాకరరావు, యూనియన్ ఉపప్రధాన కార్యదర్శి ఎం ప్రవీణ్ కుమార్ తదితరులు ఆయన మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.