Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనా టీఆర్ఎస్ నేత, శంభీపూర్ రాజు గురువారం శాసనమండలిలో ప్రమాణం చేశారు. శాసనమండలి ప్రొటెం ఛైర్మెన్ జాఫ్రీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్పీకర్ చాంబర్లో సీఎం జన్మదిన వేడుకలు
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన చాంబర్లో కేక్ కట్ చేశారు. కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రొటెం చైర్మెన్ జాఫ్రీ, మంత్రి కేటీఆర్, మహమూద్ అలీ హాజరయ్యారు.