Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లను 317 జీవో ఆధారంగా బదిలీ చేయడంతో ఉద్యోగాలు కోల్పోయిన ఐదుగురు కాంట్రాక్టు అధ్యాపకులకు తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.మల్టీజోన్-1పరిధిలో నలు గురు,మల్టీజోన్-2 పరిధిలో ఒకరు చొప్పున మొత్తం ఐదుగురు కాంట్రాక్టు అధ్యాపకులకు తిరిగి పోస్టింగ్ ఇచ్చామని తెలిపారు. వారు శనివారం విధుల్లో చేరాలని ఆదేశించారు. డీఈఐఈవోలు, నోడల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం 32 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు తిరిగి పోస్టింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.