Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పుడు కేసులు ఎత్తివేయాలి :ఐద్వా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆశా వర్కర్లపై హర్యానా ప్రభుత్వం నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నదనీ, తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న వారిపై తప్పుడు కేసులు బనాయించారని ఐద్వా ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా కేసులను బేషరతుగా ఎత్తేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్. అరుణజ్యోతి, మల్లు లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కరోనా కాలంలో అత్యంత బాధ్యతతో ప్రజలకు సేవలందించిన ఆశా కార్యకర్తలపై హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించటం అప్రజాస్వామిక చర్యని పేర్కొన్నారు. గత 72 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం వారు ఆందోళన చేస్తున్నారని తెలిపారు.