Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రస్తుతం కొనసాగుతున్న హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించబోతున్నారు. ఈ మేరకు ఆయనకు అక్కడి నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. ఆదివారం కేటీఆర్ ' ఇండియా 2030 - ట్రాన్స్ఫర్మేషనల్ డికేడ్ ' అనే అంశంపై తన ఆలోచనలను పంచుకోబోతున్నారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు మంత్రి ఈ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమంలో ప్రసంగించబోతున్నారు. ఈ దశాబ్దంలో భారతదేశ పురోగతి శీఘ్రగతిన జరగాలంటే ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ముఖ్యంగా వ్యాపార వాణిజ్యం, ప్రభుత్వ విధానాలు, సులభతర వాణిజ్యం, బిజినెస్ మహిళలకు ప్రాధాన్యత కల్పించే బిజినెస్ ఇంక్యుబేటర్లు, ఐటీ, దాని అనుబంధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపైన తన అభిప్రాయాలను పంచుకుంటారు. తన ప్రసంగంలో కేటీఆర్ ఆయా రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తన విప్లవాత్మక, వినూత్న విధానాలతో సాధించిన సానుకూల మార్పులను, ప్రగతిని ప్రస్తావించనున్నారు. తనకు ఆహ్వానం పంపిన హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకులకు కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాన్ఫరెన్స్లో భాగస్వామి అయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.