Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టిసారించింది. అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజుల వసూలుకు చెక్ పడనుంది. విధివిధానాలను రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం భేటీ కానుంది. రాష్ట్రంలో గతంలో తీసుకున్న నిర్ణయాలు, ఏపీసహా ఇతర రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రకటించిన విధివిధానాలను కమిటీ పరిశీలించనుంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కొంత అధ్యయనం చేశారు.విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ఉన్న మంత్రివర్గ ఉపసంఘంలో కొప్పుల ఈశ్వర్,తలసాని శ్రీనివాస్యాదవ్,ఎస్ నిరంజన్రె డ్డి, వి శ్రీనివాస్గౌడ్, టి హరీశ్రావు,వి ప్రశాంత్రెడ్డి,పువ్వాడ అజరుకుమా ర్,ఎర్రబెల్లి దయాకర్రావు, కెటి రామారావు సభ్యులుగా ఉన్నారు.