Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ఈసీ శనివారం ఆదేశించింది. రాబోయే 72 గంటల పాటు ఆయన ఎన్నికల సభలు, సమావేశాల్లో పాల్గొనవద్దనీ, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని నిషేధం విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులుపై జవాబు చెప్పేందుకు సమయం కావాలని ఎమ్మెల్యే రాజా సింగ్ కోరగా తిరస్కరించింది.