Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర ఇన్చార్జీ (ఫుల్ అడిషనల్ చార్జ్) డీజీపీగా అంజనీ కుమార్ శనివారం డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి అనారోగ్యం కారణంగా సిక్ లీవ్పై వెళ్లారు. ఆయన శనివారం నుంచి మార్చి 4 వరకు సెలవులో ఉంటారు. తన నివాసంలో ప్రమాదవశాత్తు పడిపోవడంతో మహేందర్ రెడ్డి భుజానికి గాయమైనట్టు పోలీసు వర్గాల సమాచారం. చికిత్స నిమిత్తం ఆయన వైద్యుల సలహా మేరకు సెలవు పెట్టారని సమాచారం. కాగా, 1990 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన అంజనీకుమార్కు రాష్ట్ర డీజీపీగా పూర్తిస్థాయి అధికారాలనిస్తూ ప్రభుత్వం నియమించింది. మహేందర్ రెడ్డి సెలవుల నుంచి తిరిగి వచ్చేంత వరకు అంజనీకుమార్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ బాధ్యతలతో పాటు డీజీపీగా కార్యనిర్వహణ బాధ్యతలను కొనసాగిస్తారని ప్రభుత్వం తెలిపింది.