Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి జిల్లాలో పరస్పర బదిలీ కోరుకునే అవకాశం
- సవరణ ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పరస్పర (మ్యూచువల్) బదిలీని కోరుకుంటే సీనియార్టీ ఉంటుంది. అది పోదని ప్రభుత్వం ప్రకటించింది. పరస్పర బదిలీ కోరుకుంటే సీనియార్టీ ఉండబోదని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21ని సవరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం జీవో నెంబర్ 402ను విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో పరస్పర బదిలీ కోరుకునే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సీనియార్టీ అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీనియార్టీ కోల్పోతామని వారంతా ఆందోళన చెందిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో పరస్పర బదిలీ కోరుకునే వారికి సీనియార్టీని కొనసాగించాలంటూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ)తోపాటు ఇతర సంఘాలు ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా తల పెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం స్పందించి ఎట్టకేలకు సీనియార్టీకి నష్టం ఉండబోదని ప్రకటించింది. అయితే పరస్పర బదిలీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చేనెల ఒకటి నుంచి ప్రారంభమై 15వ తేదీ వరకు కొనసాగుతుంది.