Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 374 మందికి కరోనా సోకింది. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 39,579 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 683 మంది డిశ్చార్జి అయ్యారు. 1,193 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,477 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్ప త్రుల్లో 971 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధి కంగా 91 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.94 శాతంగా నమోదయింది.