Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పాలకుర్తి/ మల్హర్రావు
అప్ప్పులబాధకు తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు.. జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జనగామ జిల్లా పాలకుర్తి మండలం నరసింగాపురం తండా పంచాయతీకి చెందిన భూక్య రమేష్(25) తనకున్న రెండు ఎకరాల్లో మిర్చి సాగుచేశాడు. నెలరోజుల కిందట కురిసిన వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతిన్నది. గతేడాది కూడా దిగుబడి రాక అప్పుల పాలయ్యాడు.