Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి గడ్డం ప్రసాద్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం జరుగుతున్నదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ విమర్శించారు. సీఎం కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణ పచ్చి అబద్ధమన్నారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అలైన్మెంటులో మార్పులు చేసి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని పేర్కొన్నారు. వికారాబాద్ను ఔషధ నగరం చేస్తామన్న హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ప్రాంతానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై 26న సభ నిర్వహిస్తామని తెలిపారు.