Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ సీఎం పినరయి విజయన్
తిరువనంతపురం : ప్రభుత్వ ఉద్యోగం చేపట్టాలంటే మాతృభాషపై పట్టు సాధించడాన్ని కేరళ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు ఈ నిబంధన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులకు మాత్రమే ఉండేది. అయితే స్థానిక అభ్యర్థులు కూడా మలయాళ భాష ప్రావీణ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని తెలిపింది. కొత్త సవరణను చేర్చేందుకు ప్రస్తుత చట్టంలో అవసరమైన మార్పులు చేసినట్టు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని 'మలయాళ మిషన్' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు తమ ప్రొబెషనరీ పీరియడ్ని పూర్తి చేయడానికి ముందు మలయాళ భాషా ప్రావీణ్యత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి వుంటుందని విజయన్ తెలిపారు. కేరళలో నివసిస్తున్నప్పటికీ చాలా మంది మలయాళీలకు ఆ భాష తెలియదనీ, సామాన్యులకు కూడా అవగాహన ఉండేందుకు మలయాళంను పరిపాలనా భాషగా మార్చామని విజయన్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు మలయాళ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని 2013లోనే తీసుకున్నప్పటికీ.. కేరళ రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్ సవరణలకు మార్పులు చేయాలంటే రాష్ట్ర అసెంబ్లీలోని సబ్జెక్ట్ కమిటీ ఆమోదం పొందాల్సి వుండటంతో సమయం పట్టింది.