Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 287 మందికి కరోనా సోకింది. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 35,064 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 569 మంది డిశ్చార్జి అయ్యారు. 816 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,810 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 846 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 85 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.81 శాతంగా నమోదయింది.