Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 14న కలెక్టరేట్ల ముట్టడి
- 24న చలో హైదరాబాద్ : సీఐటీయూ, వ్యకాస
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చి 14న కలెక్టరేట్లను ముట్టడించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు ప్రకటించారు. మార్చి 24న చలో హైదరాబాద్కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్ల యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో భాగంగా పని చేస్తున్న 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర సర్కారు అకారణంగా మార్చి 2020న తొలగించిందన్నారు.