Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్ల ప్రతిపాదనలపై చర్చ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో భేటి అయ్యారు. ఈసందర్భంగా తన నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిపై చర్చించి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈమేరకు దాదాపు రూ. 100 కోట్ల మేర ప్రతిపాదనలు సమర్పించారు. పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎజీ సంజీవరావును శుక్రవారం హైదరాబాద్లోని ఆ శాఖా ప్రధాన కార్యాలయంలో కలిశారు. రూ. 89 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చారు. యుద్ధప్రాతిపదికన రోడ్లను నిర్మించాలని కోరారు. అలాగే రోడ్లు, భవనాల శాఖ అధికారులను కలిసి రూ.15.25 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో 18 కిలోమీటర్ల రోడ్లను నిర్మించనున్నారు. త్వరితగతిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఇంజినీరింగ్ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.