Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేములపల్లి మండలంలో ఘటన
నవతెలంగాణ- వేములపల్లి
మానసిక వికలాంగుడైన కొనుడును ఓ తల్లి సాగర్లో తోసేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి..నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన నల్లగంతుల సుజాత భర్త ఎనిమిదేండ్ల కిందట చనిపోయాడు. వారికి ముగ్గురు కుమారులు. వారిలో ఒక కుమారుడు గోపిచంద్(14) మానసిక వికలాంగుడు. అతన్ని సాకలేక సుజాత శనివారం సాగర్ ఎడమ కాల్వ బ్రిడ్జి పై నుంచి నీటిలో తోసేసింది. స్థానికులు గమనించి కాపాడే ప్రయత్నం చేశారు. నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో గల్లంతయ్యాడు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.