Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై కవిత ట్వీట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులపై మరోసారి సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించింది. ఈ మేరకు ఆమె ఆదివారం ట్వీట్ చేశారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతున్నదని కేంద్ర ప్రభుత్వానికీ, ఎఫ్సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు పండించే పంటను కొనకుండా, పండని పంటను కొంటామంటూ ప్రకటించి బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యవసాయం గురించి ఏ మాత్రం అవగాహన లేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు,యాసంగిలో రాష్ట్రంలో ఏ రకం బియ్యం ఉత్పత్తి అవుతాయో తెలుసుకోవాలని సూచించారు. సంజరు అర్థ జ్ఞానంతో అన్నదాతలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.