Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీ) అనుబంధంగా రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఏర్పాటైంది. ఈ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా చిలుక కరుణాకర్, మహిళా విభాగం చైర్పర్సన్గా పి రమాదేవిని ఏకగ్రీవంగా నియమిస్తున్నట్టు టీ రాష్ట్ర అధ్యక్షులు చిలగాని సంపత్కుమారస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను అహర్నిశలు నిబద్ధతతో పరిష్కరించేందుకు ముందుండాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లాలని సూచించారు. వారికి తమ సహకారం ఉంటుందని పేర్కొన్నారు.