Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కౌలు రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం చూపుతున్న వివక్ష క్షమించరానిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కుమార్ విమర్శించారు. కాయకష్టం చేసే కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా, యంత్ర లక్ష్మీ సహా ప్రభుత్వ పథకాలతో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పొందే సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకం అమలుకాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.