Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్ రెడ్డి ట్వీట్టర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బంగారు తెలంగాణ ఒక బూటకమనీ, టీఆర్ఎస్ పాలనలో .రైతుల ఆత్మహత్యలు మరో విషాదమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పాలన అవినీతికి నిలువుటద్దమని తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. బంగారు తెలంగాణ రాష్ట్రంలోని మానుకోట ప్రాంతానికి చెందిన రైతులు...మూడు నెలల్లో 17మంది ఆత్మహత్యలు చేసుకోవడం వ్యవసాయ సంక్షోభ తీవ్రతకు నిదర్శనమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీలో షికారు చేస్తున్న సీఎంకు రైతుల ఆర్తనాదాలు వినబడటం లేదా? అని ప్రశ్నించారు.