Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వేములవాడ
రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం వైభంగా జరిగింది. ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఏఈవో మోహన్ రాజ్, వేదపండితులు సూర్యనారాయణరాజు, జితేష్ పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఎమ్మెల్యే రమేష్బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈవో రమాదేవి మంత్రులను శాలువాలతో ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కాగా మహా శివరాత్రి జాతర వేడుకలకు వీఐపీల తాకిడి పెరిగింది. దాంతో సందర్శకులు అసౌకర్యానికి లోనయ్యారు.