Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనదుర్గ భవానీమాతకు పట్టువస్త్రాల సమర్పణ
నవతెలంగాణ-పాపన్నపేట
ఏడుపాయల, వన దుర్గా ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల జాతర సందర్భంగా వనదుర్గ భవానీమాతకు మంత్రి హరీశ్రావు ప్రభుత్వం తరపున మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజలు చేసిన అనంతరం ఆయన మెదక్ జెడ్పీ చైర్పర్సన్ హేమలత, ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులతో పాటు ఏడుపాయలలోని వనదుర్గ ప్రాజెక్టును పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ రూ.1,500 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అందులో నుంచి రూ.100 కోట్లు ఏడుపాయలకు కేటాయిస్తామని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఏడుపాయలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు.