Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా మారనున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, మే నాటికి 48 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్నం బుధవారం తెలిపారు. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఒకటి, రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం పరిసర జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 35 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్లో 45 డిగ్రీలు, మే నెలలో 48 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశముందని తెలిపారు.